Corona Virus: దేశంలో కొత్తగా 12,408 మందికి కరోనా నిర్ధారణ

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,02,591
  • మృతుల సంఖ్య 1,54,823
  • 49,59,445 మందికి వ్యాక్సిన్
  • 19,99,31,795 కరోనా పరీక్షలు  
India reports 12408 new COVID19 cases

దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 12,408 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 15,853 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,02,591 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 120 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,823 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,04,96,308 మంది కోలుకున్నారు. 1,51,460 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 49,59,445 మందికి వ్యాక్సిన్ వేశారు.
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,99,31,795 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,15,776 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News