pattabhi: ప‌ట్టాభి ఇంటికి చేరుకున్న చంద్ర‌బాబు.. దాడి గురించి వివరించిన పట్టాభి!

  • విజ‌య‌వాడ‌లోని గురునాన‌క్ న‌గ‌ర్‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు
  • ప‌ట్టాభికి త‌గిలిన గాయాల‌ ప‌రిశీలన‌
  • టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరిక  
chandrababu goes pattabhi home

తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై కొంద‌రు దాడికి పాల్ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. విజ‌య‌వాడ‌లోని గురునాన‌క్ న‌గ‌ర్‌లో ఉన్న‌ ప‌ట్టాభి ఇంటికి చేరుకున్నారు. ప‌ట్టాభిని ప‌రామ‌ర్శించి, ఆయ‌నకు త‌గిలిన గాయాల‌ను ప‌రిశీలించారు.

త‌న‌పై జ‌రిగిన దాడి గురించి చంద్ర‌బాబుకు ప‌ట్టాభి వివ‌రించి చెప్పారు. ఆ స‌మ‌యంలో ప‌ట్టాభి మంచంపైనే ప‌డుకుని ఉన్నారు. ప‌ట్టాభి ఇంటికి  దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, బోండా ఉమా మ‌హేశ్వర‌రావుతో పాటు ప‌లువురు టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కూడా భారీగా చేరుకుంటున్నారు.

More Telugu News