Corona Virus: దేశంలో కొత్త‌గా 8,635 మందికి కరోనా నిర్ధారణ

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,66,245
  • మృతుల సంఖ్య 1,54,486
  • కోలుకున్న వారు 1,04,48,406 మంది
  • 39,50,156 మందికి వ్యాక్సిన్  
India reports 8635 new COVID19 cases

దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 8,635 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 13,423 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,66,245 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 94 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,486కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,04,48,406 మంది కోలుకున్నారు. 1,63,353 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 39,50,156 మందికి వ్యాక్సిన్ వేశారు.
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,77,52,057 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,59,422 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News