Corona Virus: దేశంలో కొత్త‌గా 13,083 మందికి కరోనా

India reports 13083 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,33,131  
  • మృతుల సంఖ్య 1,54,147
  • మొత్తం 19,58,37,408 కరోనా పరీక్షలు
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 13,083 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 14,808 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,33,131 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 137 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,147 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,04,09,160 మంది కోలుకున్నారు. 1,69,824 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,58,37,408 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,56,329 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News