Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

  • 24 గంటల్లో 12,689 మందికి కరోనా నిర్ధారణ
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,89,527
  • మృతుల సంఖ్య 1,53,587
India reports 12689 new  COVID19 cases

దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 12,689 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 13,320 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,89,527కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 137 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,724కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,03,59,305 మంది కోలుకున్నారు. 1,76,498 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 20,29,480 మందికి వ్యాక్సిన్లు వేశారు.

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,36,13,120 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 5,50,426 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News