Corona Virus: దేశంలో కొత్త‌గా 15,158 మందికి కరోనా నిర్ధారణ

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,05,42,841
  • మృతుల సంఖ్య 1,52,093
  • కోలుకున్న వారు 1,01,79,715 మంది  
  • మొత్తం 18,57,65,491  కరోనా పరీక్షలు  
India reports 15158 new COVID19 cases

దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 15,158 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 16,977 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,05,42,841కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 175 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,093 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,01,79,715 మంది కోలుకున్నారు. 2,11,033 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
   
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 18,57,65,491  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,03,090 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News