కశ్మీర్ యోధురాలి పాత్రలో కంగన రనౌత్!
- 'మణికర్ణిక'కు సీక్వెల్ గా 'ద లెజండ్ ఆఫ్ దిద్దా'
- కశ్మీర్ మహారాణి దిద్దా పాత్రలో కంగనా
- మహ్మద్ గజనీని రెండుసార్లు ఓడించిన దిద్దా
ఈ క్రమంలో ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నట్టు కంగన ఏ ఈరోజు ప్రకటించింది. ఈ చిత్రం పేరు 'మణికర్ణిక రిటర్న్స్: ద లెజండ్ ఆఫ్ దిద్దా'. ఈ చిత్రాన్ని 'మణికర్ణిక'ను మించిన బడ్జెట్టుతో.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. మణికర్ణికను నిర్మించిన నిర్మాత కమల్ జైన్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు.
ఇక ఈ చిత్రం కశ్మీర్ మహారాణి, యోధురాలు దిద్దా కథగా తెరకెక్కుతోంది. మహ్మద్ గజనీని రెండుసార్లు యుద్ధంలో ఓడించిన ధీరవనిత దిద్దా. పైగా, ఒక కాలు పోలియో కారణంగా చచ్చుబడినప్పటికీ, యుద్ధంలో ఆమె చూపిన తెగువ.. పోరాటపటిమ దిద్దాను మహా యోధురాలిగా చూపుతాయి. ఇప్పుడీ కథలో దిద్దా పాత్రలో కంగన నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో మొదలవుతుందని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.