Corona Virus: దేశంలో కొత్త‌గా 12,584 మందికి కరోనా నిర్ధారణ

India reports 12584 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 12,584 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 18,385 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,79,179కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 167 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,51,327 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,01,11,294  మంది కోలుకున్నారు.  2,16,558 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 18,26,52,887 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,97,056 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News