Corona Virus: దేశంలో కొత్త‌గా 16,311 మందికి కరోనా నిర్ధారణ

  • మొత్తం కేసులు 1,04,66,595
  • మృతుల సంఖ్య  1,51,160
  • కోలుకున్న వారు 1,00,92,909 మంది
 India reports 16311   new COVID19 cases

దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 16,311 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 19,299 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య1,04,66,595కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 161 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,51,160 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,00,92,909 మంది కోలుకున్నారు.  2,22,526 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 18,17,55,831 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,59,209 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News