Jagan: 9 దేవాలయాల పునర్నిర్మాణానికి భూమిపూజ నిర్వహించిన జగన్

  • సీతమ్మ పాదాల వద్ద నిర్మాణ పనులకు శంకుస్థాపన
  • అనంతరం ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం
  • పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
Jagan performs Bhumi Pooja for reconstruction of 9 temples

ఏపీ ముఖ్యమంత్రి జగన్ చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలో గత ప్రభుత్వం హయాంలో కూల్చివేసిన 9 ఆలయాలను పునర్నిర్మించే పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ ఉదయం 11.01 గంటలకు కృష్ణానది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.  

రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో పునర్నిర్మిస్తున్న ఆలయాలు ఇవే:

  • సీతమ్మ పాదాలు
  • రాహుకేతు ఆలయం
  • బొడ్డు బొమ్మ
  • శనైశ్చర ఆలయం
  • దుర్గగుడి మెట్ల వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయం
  • సీతారామ లక్షణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం
  • సీతమ్మ పాదాలకు సమీపంలో దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం
  • పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న వీరబాబు ఆలయం
  • కనకదుర్గ నగర్ లో ఉన్న శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల.

More Telugu News