Corona Virus: దేశంలో కొత్త‌గా 18,139 మందికి కరోనా నిర్ధారణ

  • ఒక్క‌రోజులో కోలుకున్న వారు 20,539 మంది
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,13,417
  • మృతుల సంఖ్య 1,50,570
  • యాక్టివ్ కేసులు 2,25,449
18139 New Covid Cases In India

దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 18,139 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 20,539 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,13,417కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 234 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,50,570కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  1,00,37,398 మంది కోలుకున్నారు.  2,25,449 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 17,93,36,364 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,35,369 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News