పూర్వజన్మలో శ్రీ వైకుంఠ రాజు తానేనట... కోట కోసం తవ్విస్తున్న తమిళ తంబీ!
- ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్న సుందరీ కన్నన్
- కొంగరాయకురిచ్చి ప్రాంతంలో భారీ ఆలయం కట్టించానని వెల్లడి
- తవ్వకాలను అడ్డుకున్న తహసీల్దారు
ఈ ప్రాంతంలోనే ఆలయం భూమిలో కూరుకుపోయిందని చెబుతూ కార్మికులను పెట్టి తవ్వకాలు ప్రారంభించాడు. తాను రాజుగా ఉన్న సమయంలో తన భార్యతో కలిసి బృహదీశ్వరాయలయంలో జరుగుతున్న తొలి మహా కుంభాభిషేకానికి బయలుదేరిన వేళ, తనను ప్రేమించిన సేవకురాలు విషం పెట్టి చంపివేసిందని అన్నాడు. ఇక, ఇతను సాగిస్తున్న తవ్వకాలను ఆ ప్రాంత తహసీల్దారు అడ్డుకున్నారు. పురావస్తు శాఖ అనుమతి లేకుండా ఇలా చేయడం నేరమని అతన్ని మందలించారు.