Corona Virus: దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్!

  • 24 గంటల్లో 20,550 మందికి కరోనా 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,44,853
  • మృతుల సంఖ్య 1,48,439
India reports 20550 new COVID19 cases

దేశంలో గత 24 గంటల్లో 20,550 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 26,572 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,44,853కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 286 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,48,439కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 98,34,141 మంది కోలుకున్నారు.  2,62,272 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
  కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 17,09,22,030  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,20,281 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News