Nallamada Devender Reddy: అమెరికాలో దుర్మరణం పాలైన నల్గొండ జిల్లా టెక్కీ

  • న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం
  • కారులో మంటలు చెలరేగిన వైనం
  • సజీవ దహనమైన నల్లమడ దేవేందర్ రెడ్డి
  • దేవేందర్ రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా కర్నాటిపల్లి
Nalgonda IT Engineer dies in USA

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన నల్లమడ దేవేందర్ రెడ్డి దుర్మరణం పాలయ్యారు. ఆయన వయసు 45 సంవత్సరాలు. న్యూజెర్సీలో ఓ రహదారిపై కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కారులో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో దేవేందర్ రెడ్డి అగ్నికి ఆహుతయ్యారు.

ఈ ఘటనపై న్యూజెర్సీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దేవేందర్ రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా కర్నాటిపల్లి. గత కొంతకాలంగా అమెరికాలో ఐటీ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. దేవేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఎన్నారై విభాగంలో సభ్యుడు. దేవేందర్ మృతి పట్ల ఎన్నారైలు విచారం వ్యక్తం చేశారు.

More Telugu News