Corona Virus: దేశంలో 20,021 మందికి కొత్తగా కరోనా

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,07,871
  • మృతుల సంఖ్య 1,47,901
  • కోలుకున్న వారు 97,82,669 మంది 
  • మొత్తం 16,88,18,054 కరోనా పరీక్షలు 
India reports 20021 new COVID19 cases

దేశంలో గత 24 గంటల్లో 20,021 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 21,131 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,07,871కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 279 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,47,901కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 97,82,669 మంది కోలుకున్నారు.  2,77,301 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 16,88,18,054 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న  7,15,397 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News