Corona Virus: ఏపీ కరోనా అప్ డేట్: 534 కొత్త కేసులు, 2 మరణాలు

Corona stats of Andhra Pradesh
  • గత 24 గంటల్లో 63,821 పరీక్షలు
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 130 కేసులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 13 మందికి పాజిటివ్
  • తాజాగా 498 మందికి కరోనా నయం
  • యాక్టివ్ కేసుల సంఖ్య 4,454
ఏపీలో గత 24 గంటల్లో 63,821 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 534 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 130 కేసులు రాగా, కృష్ణా జిల్లాలో 74, గుంటూరు జిల్లాలో 54, పశ్చిమ గోదావరి జిల్లాలో 51 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 13, విజయనగరం జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 498 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 8,77,348 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,65,825 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. 4,454 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,069కి చేరింది.
Corona Virus
Andhra Pradesh
Positive Cases
Deaths
Active Cases

More Telugu News