Smugglers: సరిహద్దుల్లో హైటెక్ స్మగ్లింగ్.. ఇద్దరి అరెస్ట్

  • పాక్ నుంచి భారత్ లోకి డ్రగ్స్, ఆయుధాలు
  • అక్రమ రవాణాకు డ్రోన్లను వినియోగిస్తున్న స్మగ్లర్లు
  • పక్కా సమాచారంతో పోలీసుల దాడులు
  • డ్రగ్స్, డ్రోన్, తుపాకీ స్వాధీనం
  • నిందితులకు పాక్ స్మగ్లర్లతో సంబంధాలు
Smugglers uses drones to illegal transit of drugs and weapons

పాకిస్థాన్ నుంచి భారత్ లోకి అక్రమంగా డ్రగ్స్, ఆయుధాలు రవాణా చేసేందుకు స్మగ్లర్లు హైటెక్ బాటను ఎంచుకున్నారు. డ్రోన్ల సాయంతో సరిహద్దుల ఆవల నుంచి అక్రమ రవాణా చేపడుతున్నారు. ఈ అక్రమదందాపై పక్కా సమాచారంతో పంజాబ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరికి పాకిస్థాన్ స్మగ్లర్లతో సన్నిహిత సంబంధాలున్నట్టు భావిస్తున్నారు. అరెస్టయిన వారిని లఖ్బీర్ సింగ్, బచిత్తర్ సింగ్ లుగా గుర్తించారు. ఈ దాడుల్లో పాలుపంచుకున్న అమృత్ సర్ పోలీసులు మాదకద్రవ్యాలు, ఒక క్వాడ్ కాప్టర్ డ్రోన్, సపోర్టర్ స్టాండ్, స్కైడ్రాయిడ్ ట్రాన్స్ మిటర్, కెమెరా సహిత మినీ రిసీవర్, పాయింట్ 32 బోర్ రివాల్వర్, కొన్ని కార్ట్రిడ్జ్ లు, ఓ స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News