Andhra Pradesh: ఏపీలో కొత్తగా మరో 510 కరోనా కేసులు.. అప్ డేట్స్ ఇవిగో!

  • 24 గంటల్లో ముగ్గురు మృతి
  • ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 5,078
  • 8,75,025కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
Andhra Pradesh reports 510 new Corona cases in the last 24 hours

ఏపీలో కరోనాకు సంబంధించి గత 24 గంటల్లో 510 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 67,495 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు కరోనా వల్ల చనిపోయారు. గుంటూరు, కడప, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్క మరణం సంభవించింది. ఇదే సమయంలో 665 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,75,025కి చేరుకుంది. మొత్తం 7,052 మరణాలు సంభవించాయి. 8,62,895 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,078 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

More Telugu News