Jana Reddy: నేను పార్టీ మారడం లేదు: కాంగ్రెస్ నేత జానారెడ్డి వివరణ

  • నన్ను ఏ పార్టీ నేతలూ సంప్రదించలేదు
  • సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది
  • అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే కొత్త అధ్యక్షుడు
congress leader jana reddy about leaving party

తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి స్పందించారు. ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, ఏ పార్టీ నేతలూ తనను సంప్రదించలేదని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో మీరు పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు జానారెడ్డి బదులిస్తూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందన్నారు.

నిన్న జరిగిన టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం అనంతరం జానారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో పార్టీలోని అందరి అభిప్రాయాలు సేకరించి, అందరినీ ఒప్పించిన తర్వాత హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అధ్యక్షుడిగా ఎవరి పేరు సూచించారన్న ప్రశ్నకు, అది బహిర్గతం చేయాల్సిన విషయం కాదని సున్నితంగా తిరస్కరించారు.

More Telugu News