Donald Trump: ఎన్నికల తరువాత తొలిసారి ప్రజల మధ్యకు వచ్చిన ట్రంప్... మళ్లీ అదే పాత పాట!

  • జనవరి 5న స్పెషల్ సెనెట్ ఎన్నికలు
  • మోసం చేసే బైడెన్ గెలిచారు
  • తానే అసలైన విజేతనన్న ట్రంప్
Trump Says He is the Real Winner

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం అనంతరం డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడారు. తన ప్రసంగంలోనూ ఆయన పాత పాటే పాడారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లు మోసం చేసి గెలిచారని ఆరోపించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, అందుకే బైడెన్ గెలిచాడని విమర్శలు గుప్పించారు.

తాను నిజంగా ఓటమిపాలై ఉంటే, తానే స్వయంగా అంగీకరించి, ఇంటికి వెళ్లి పోయి ఉండేవాడినని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో అసలైన విజేతను తానేనని, కుట్రతోనే బైడెన్ గెలిచాడని ట్రంప్ ఆరోపించారు. జనవరి 5న స్పెషల్ సెనెట్ ఎన్నికలు జరుగనుండగా, రిపబ్లికన్ల తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు.

More Telugu News