India: దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

  • గత 24 గంటల్లో 36,652 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,08,211
  • మృతుల సంఖ్య 1,39,700
  • కోలుకున్న వారు 90,58,822 మంది  
  Indias total cases rise to 9608211

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 96 లక్షలు దాటింది.  కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 36,652 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,08,211కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,533 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 512 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,39,700కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 90,58,822 మంది కోలుకున్నారు. 4,09,689  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 14,58,85,512 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,57,763  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

More Telugu News