నేడు కూడా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు!
- ఇటీవలి కాలంలో రోజూ వడ్డన
- 13 రోజుల వ్యవధిలో 11 సార్లు పెంపు
- ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధర
కాగా, తాజా పెంపుదల తరువాత ఢిల్లీలో లీటర్ పెట్రోలు రూ. 82.66కు చేరగా, డీజిల్ ధర రూ. 72.84కు పెరిగింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో నిన్న క్రూడాయిల్ ధర బ్యారల్ కు 2 శాతం పెరిగింది. ఇక నేడు ఈ ధర మరింతగా పెరిగి నైమెక్స్ చమురు బ్యారల్ ధర 45.30 డాలర్లకు చేరగా, లండన్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 49.30 డాలర్లకు చేరింది. మార్చి తరువాత క్రూడాయిల్ ధరలు ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.