Corona Virus: దేశంలో మరో 29,164 మందికి కరోనా నిర్ధారణ

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,74,291 
  • మృతుల సంఖ్య 1,30,519
  • కోలుకున్న వారు 82,90,371 మంది
  • మొత్తం 12,65,42,907 కరోనా పరీక్షలు  
 29164 new COVID19 infections  in india

దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 29,164 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,74,291 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 40,791 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 449 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,30,519 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 82,90,371 మంది కోలుకున్నారు. 4,53,401 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.              
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 12,65,42,907 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,44,382 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News