KTR: మంత్రి తలసానిని ఆకాశానికెత్తేస్తూ కేటీఆర్ వ్యాఖ్యలు‌!

  • తలసాని సనత్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు
  • ప్రజల అవసరాలు తెలుసుకుని తీర్చేవారే నిజమైన నాయకులు
  • అభివృద్ధి పనులన్నింటినీ సనత్‌నగర్‌తోనే ప్రారంభించాం
  • రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఇక్కడి నుంచే షురూ
ktr praises talasani

హైదరాబాద్ లోని సనత్ నగర్ లోని నెహ్రూ పార్క్ లో థీమ్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తెలంగాణ మంత్రులు కేటీఆర్.. ఆ ప్రాంతంలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మంత్రి తలసానిని ఆకాశానికి ఎత్తేశారు. తలసాని సనత్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ప్రజల అవసరాలు తెలుసుకుని తీర్చేవారే నిజమైన నాయకులని ఆయన కొనియాడారు.

హైదరాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి పనులు చేసినా వాటిని సనత్‌నగర్‌లోనే ప్రారంభించామని తెలిపారు. ఇక్కడి నుంచే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. ఇక్కడి రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. తాము హైదరాబాద్‌లో  ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని కేటీఆర్ చెప్పారు.

తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ 1గా నిలపాలనే లక్ష్యంతో తాము పని చేస్తున్నామని చెప్పారు.హైదరాబాద్‌లో మిగిలి ఉన్న పనులను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని తెలిపారు. కరోనా కారణంగా ఆదాయం పడిపోయిందని చెప్పారు. అర్హులైన వరద బాధితులందరికీ సాయం చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ నగరం అందరిదని అన్నారు. ఈ నగరాన్ని కొందరిదిగా పరిమితం చేస్తూ కొందరు చేస్తోన్న రాజకీయ ప్రయత్నాలను అడ్డుకోవాలని అన్నారు.

More Telugu News