Telangana: రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

  • సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో భేటీ
  • దుబ్బాక ఫలితంపై విశ్లేషించనున్న కేసీఆర్
  • జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించే అవకాశం
Telangana cabinet will meet tomorrow

సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరగనుంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల అనంతరం నిర్వహిస్తున్న క్యాబినెట్ భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సమావేశంలో దుబ్బాక ఫలితం అంశం తప్పకుండా చర్చకు వస్తుందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ ఓటమికి గల కారణాలను సీఎం కేసీఆర్ విశ్లేషించే అవకాశాలున్నాయి. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశంపైనా కీలక చర్చ జరగనుంది. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలపై ఆయన మంత్రులతో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News