Dubbaka: దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని నరేంద్రమోదీ

  • ఈ విజయం చారిత్రాత్మకం
  • ఈ గెలుపు మరింత శక్తిని ఇచ్చింది
  • అవినీతి, రాచరిక పాలనకు వ్యతిరేకంగానే ఈ ఫలితం: నడ్డా
Modi thanks to Dubbaka people on BJP victory

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ సాధించిన అనూహ్య విజయంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఈ విజయం చారిత్రాత్మకమన్న మోదీ.. బీజేపీని గెలిపించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. రాష్ట్రాభివృద్ధిలో ఈ విజయం తమకు మరింత శక్తినిస్తుందని అన్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు   1,079  ఓట్లతో  విజయం సాధించారు. గెలిచిన రఘునందన్‌రావుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దుబ్బాకలో విజయం సాధించేందుకు కృషి చేసిన కార్యకర్తలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు షా అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ అవినీతికి, రాచరిక పాలనకు వ్యతిరేకంగా ఈ ఫలితాలు వెలువడ్డాయని నడ్డా అన్నారు.

More Telugu News