Dubbaka: పెరుగుతున్న ఉత్కంఠ.. ఏడో రౌండ్లో కూడా టీఆర్ఎస్ ఆధిక్యత

  • దుబ్బాకలో పూర్తైన ఏడో రౌండ్ కౌంటింగ్
  • ఏడో రౌండులో టీఆర్ఎస్ కు 182 ఓట్ల ఆధిక్యత
  • మొత్తంమీద బీజేపీకి 2,485 ఓట్ల లీడింగ్
TRS gets lead in seventh round in Dubbaka counting

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల సరళి ఉత్కంఠను రేపుతోంది. తొలి ఐదు రౌండ్లలో బీజేపీ ఆధిక్యతను సాధించగా... ఆ తర్వాత ఆరో రౌండులో టీఆర్ఎస్ పుంజుకుంది. ఏడో రౌండులో సైతం ఆధిక్యతను ప్రదర్శించింది. ఏడో రౌండులో టీఆర్ఎస్ అభ్యర్థికి 2,718 ఓట్లు పడగా, బీజేపీకి 2,536 ఓట్లు వచ్చాయి. దీంతో ఏడో రౌండులో బీజేపీ కంటే టీఆర్ఎస్ 182 ఓట్లను అధికంగా సాధించింది. ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీకి 22,762, టీఆర్ఎస్ కు 20,277, కాంగ్రెస్ కు 4,003 ఓట్లు వచ్చాయి. మొత్తంమీద ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 2,485 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

More Telugu News