Vizag: జనాలంతా చూస్తుండగా విశాఖలో దారుణం... తనను కాదన్నదని యువతి గొంతుకోసిన దుర్మార్గుడు!

  • గాజువాక ప్రాంతంలో ఘటన
  • వరలక్ష్మిని అటకాయించిన అనిల్
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Girl Attacked On Crowded Street In Visakhapatnam

విశాఖపట్నంలో నలుగురూ చూస్తుండగా, ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. తనను కాదన్నదన్న కారణంతో ఓ యువతి గొంతు కోశాడు. ఈ ఘటన గాజువాక ప్రాంతంలోని సుందరయ్య కాలనీ, సాయిబాబా దేవాలయం సమీపంలో నడిరోడ్డుపై జరిగింది. వరలక్ష్మి అనే యువతిని దారికాచి అటకాయించిన అనిల్ అనే వ్యక్తి, కాసేపు వాగ్వాదం తరువాత గొంతు కోయగా, అక్కడికక్కడే వరలక్ష్మి కుప్పకూలి మరణించింది. ఈ కేసులో నిందితుడు అనిల్ ను అదుపులోకి తీసుకున్నామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News