Corona Virus: దేశంలో 80 లక్షలకు చేరువైన కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 43,893 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,90,322
  • మృతుల సంఖ్య 1,20,010
  • కోలుకున్న 72,59,509 మంది  
With 43893 new COVID19 infections

దేశంలో కరోనా కేసుల సంఖ్య 80 లక్షలకు చేరువవుతోంది. కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 43,893 మందికి కరోనా నిర్ధారణ అయిందని  పేర్కొంది. అదే సమయంలో 58,439 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,90,322 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 508 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,20,010 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 72,59,509 మంది కోలుకున్నారు. 6,10,803 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
        
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 10,54,87,680  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,66,786 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News