Corona Virus: దేశంలో కొత్తగా 46,791 మందికి కరోనా

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 75,97,064
  • మృతుల సంఖ్య 1,15,197
  • కోలుకున్న వారు 67,33,329 మంది
  • మొత్తం 9,61,16,771 కరోనా పరీక్షలు
46790 fresh COVID 19 cases in India

దేశంలో కరోనా కేసుల సంఖ్యపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 46,791 మందికి కరోనా నిర్ధారణ అయిందని  పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 75,97,064కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 587 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,15,197 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 67,33,329 మంది కోలుకున్నారు. 7,48,538 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
           
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 9,61,16,771 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,32,795 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News