Anchor Anasuya: కొడుకు మాటలకు భావోద్వేగానికి గురైన యాంకర్ అనసూయ!

  • అప్పట్లో కరోనా, వరదలు లేవు
  • ఆ కాలంలోకి వెళ్లాలని ఉందన్న అనసూయ కుమారుడు
  • కొడుకు మాటలతో భావోద్వేగానికి గురయ్యానన్న అనసూయ
Anchor Anasuya Cried after her Son Words

ప్రముఖ టాలీవుడ్ యాంకర్ అనసూయను, కడుపున పుట్టిన బిడ్డే ఏడిపించాడట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆమె, తీవ్ర భావోద్వేగానికి లోనయింది. కరోనాతో మారిన ప్రపంచం నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న వేళ, తనకు గతంలోకి వెళ్లే అవకాశం కావాలని, ప్రస్తుతం 9 సంవత్సరాల వయసులో ఉన్న అనసూయ కొడుకు అన్నాడట.

ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్న అనసూయ, "అమ్మా... నేను గతంలోకి వెళ్లాలని అనుకుంటున్నాను. అప్పట్లో కరోనా లేదు, వరదలు లేవు. అప్పుడు ఎంతో ఆనందంగా ఉండేవాడిని" అని తన కుమారుడు చెప్పడంతో ఎంతో బాధపడి, కన్నీరు పెట్టుకున్నానని అనసూయ పేర్కొంది. ఈ పరిస్థితులను మనమే కొని తెచ్చుకున్నామని, భావి తరాలకు మనం ఏం ఇవ్వగలమని ఆమె ప్రశ్నించారు. అనసూయ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

More Telugu News