Corona Virus: దేశంలో కరోనా కేసుల అప్ డేట్స్!

  • గత 24 గంటల్లో 63,509 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 72,39,390
  • మృతుల సంఖ్య 1,10,586  
India reports a spike of 63509 new COVID19 cases

దేశంలో కరోనా కేసుల సంఖ్య 72 లక్షలు దాటింది. భారత్‌లో గత 24 గంటల్లో 63,509 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 72,39,390 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 730 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,10,586 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 63,01,928 మంది కోలుకున్నారు. 8,26,876 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 9,00,90,122 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,45,015 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News