Arvind Kejriwal: బీజేపీ, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలే: కేజ్రీవాల్

  • ఆ రెండు పార్టీల సిద్ధాంతాలు మాత్రమే వేరు
  • మొదటి నుంచి కాంగ్రెస్ దోచుకుంది
  • ఇప్పుడు ఆ స్థానంలోకి బీజేపీ వచ్చింది
Both congress and BJP are corrupted parties says Kejriwal

జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లపై ఢిల్లీ ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఆ రెండు పార్టీలూ అవినీతి పార్టీలేనని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సిద్ధాంతాలు వేరు కావచ్చని... కానీ, అవినీతి అంశానికి వచ్చేసరికి రెండు పార్టీలను ఒకే మాదిరి చూడాలని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని కాంగ్రెస్ పార్టీ దోచుకుందని... ఇప్పుడు ఆ స్థానంలోకి బీజేపీ వచ్చిందని చెప్పారు. బీజేపీ పాలనలో పెద్ద స్థాయిలో అవినీతి చోటుచేసుకుంటోందని అన్నారు.

కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల జీవితాలను నాశనం చేస్తాయని... ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లులను రూపొందిస్తున్న సమయంలో సంబంధిత కమిటీలో ఉన్న ఒక కాంగ్రెస్ నేత బీజేపీని అభినందించారని... ఆ బిల్లులు చట్టరూపం దాల్చాక వాటిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలను వీళ్లంతా మూర్ఖులు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

More Telugu News