kbc: 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి'లో తెలుగు టీచర్‌.. ఆమె గురించి తెలుసుకుని అమితాబ్ ప్రశంసలు

  • ఈ రోజు రాత్రి ప్రసారం
  • పాల్గొన్న అల్వాల్‌ టీచర్‌ సబితా రెడ్డి
  • భర్తను కోల్పోయినప్పటికీ పిల్లలకు మంచి విద్య
telugu teacher in kbc

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అబితాబ్ బచ్చన్‌‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' షోలో తాజాగా హైదరాబాద్‌లోని అల్వాల్‌ ప్రాంతంలో టీచర్‌గా పనిచేస్తోన్న సబితా రెడ్డి అనే మహిళ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కేబీసీ విడుదల చేసింది. ఈ ఎపిసోడ్‌ ఈ రోజు రాత్రి ప్రసారం కానుంది. కార్యక్రమంలో ఆమె గురించి పలు విషయాలు తెలుసుకున్న అమితాబ్‌ బచ్చన్‌ ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోయారు.

సబితా రెడ్డి భర్తను కోల్పోయినా అధైర్య పడకుండా కష్టపడి తన పిల్లలను పెంచుతున్నారు. వారికి మంచి విద్యను అందిస్తానని అన్నారు. వారికి ఆస్తులు ఇవ్వకున్నా, మంచి విద్యను అందివ్వాలని ఆమె అన్నారు. ఈ రోజు రాత్రి కేబీసీ 12 నుంచి 6వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇందులో  మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు పాల్గొన్నారు. సబితారెడ్డితో పాటు పాల్గొన్న మరో కంటెస్టెంట్‌ ప్రదీప్‌కుమార్‌ సూద్‌ ఈ ఎపిసోడ్‌లో 12.5 లక్షల రూపాయలు గెలుచుకున్నారు.

More Telugu News