Chittoor District: చిత్తూరు జిల్లా అగర మంగళంలో పురాతన నందివిగ్రహం ధ్వంసం

  • శ్రీఅభయాంజనేయస్వామి ఆలయంలో ఘటన
  • నంది విగ్రహాన్ని పెకలించి తీసుకెళ్లి పగలగొట్టిన వైనం
  • 89 మంది అనుమానితులను విచారించిన పోలీసులు
Nandi Idol destroyed in Chittoor district

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని ఓ ఆలయంలో నంది విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అగర మంగళంలోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయంలో ఈ ఘటన జరిగింది.

 ఆలయం వెనక భాగం నుంచి ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించిన దుండగులు నందిని పెకలించి ఆలయం వెనక్కి తీసుకెళ్లి పగలగొట్టారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్న 89 మంది అనుమానితులను పోలీసులు విచారించారు. కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని, ఇందుకోసం మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు.

More Telugu News