Corona Virus: తెలంగాణలో 1,100కు చేరిన కరోనా మృతుల సంఖ్య

  • 24 గంటల్లో కొత్తగా 1,967 కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,85,833
  • 1,54,499 మంది డిశ్చార్జ్  
spike of 1100 new cases in telangana

తెలంగాణ‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కొవిడ్ 19 కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,967 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,058 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,85,833కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,54,499 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,100కు చేరింది. ప్రస్తుతం 30,234 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 297, రంగారెడ్డి జిల్లాలో 147 కేసులు నమోదయ్యాయి.
 
తెలంగాణలో కరోనా కేసుల పూర్తి వివరాలు..

     

More Telugu News