దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన కిషన్ రెడ్డి, కేటీఆర్
- దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి
- జూబ్లీహిల్స్-మాదాపూర్ మధ్య తగ్గనున్న ట్రాఫిక్ సమస్యలు
- శని, ఆదివారాల్లో బ్రిడ్జిపై వాహనాలు నిషేధం
కాగా, ఈ బ్రిడ్జి దేశంలోనే అతి పెద్ద కేబుల్ బ్రిడ్జిగా పేర్కొంటున్నారు. ఈ వంతెన నిర్మాణంతో జూబ్లీహిల్స్-మాదాపూర్ మధ్య ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా రంగురంగుల విద్యుద్దీప కాంతులతో వంతెన జిగేల్మంటోంది. అయితే ఈ బ్రిడ్జిపై శని, ఆదివారాల్లో మాత్రం వాహనాలను అనుమతించరు. ఈ రెండు రోజులు పర్యాటకులు కాలినడకన బ్రిడ్జి అందాలు ఆస్వాదించవచ్చు.
ఈ వంతెన ముఖ్యాంశాలు
- దీని పొడవు 754.38 మీటర్లు
- దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తుతో వంతెన నిర్మాణం
- రూ.184 కోట్ల వ్యయంతో నిర్మాణం
- ఆస్ట్రియా నుంచి ప్రత్యేకంగా కేబుళ్ల దిగుమతి
- బ్రిడ్జి నిర్మాణంలో 13 ఫౌండేషన్లు, కేవలం రెండు పిల్లర్లు
- నిర్మాణంలో పాలుపంచుకున్న 8 దేశాల ఇంజినీర్లు
- వంతెనను నిర్మించిన ఎల్ అండ్ టీ
- ఈ కేబుల్ బ్రిడ్జితో జూబ్లీహిల్స్ నుంచి మైండ్ స్పేస్, గచ్చిబౌలికి తగ్గిన దూరం
- బ్రిడ్జిపై మొత్తం 40 వేల ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు


.
.