రేపు ఢిల్లీకి వెళ్తున్న జగన్.. మోదీని కలిసే అవకాశం!
- రేపు మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీకి పయనం
- అమిత్ షా, నిర్మలా సీతారామన్ లతో భేటీ కానున్న జగన్
- రెండు రోజుల పాటు కొనసాగనున్న పర్యటన
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ పన్నుల వాటాను విడుదల చేయాలని మంత్రులను జగన్ కోరనున్నారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న అంశాలు, పార్లమెంటులో జరిగిన పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలో ఉండనున్నారు. మరోవైపు, జగన్ ఇంత హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.