Corona Virus: దేశంలో 53 లక్షలు దాటిన కరోనా కేసులు

  • గత 24 గంటల్లో దేశంలో 93,337 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,08,015 
  • మృతుల సంఖ్య మొత్తం 85,619
  • కోలుకున్న వారు 42,08,432 మంది
Indias COVID19 case tally crosses 53lakh mark

దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 93,337 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,08,015కు చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,247 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 85,619కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 42,08,432 మంది కోలుకున్నారు. 10,13,964 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
                       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,24,54,254 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,81,911 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.  
        

More Telugu News