Corona Virus: ఏపీలో కరోనా కలకలం.. 6 లక్షలు దాటిన కేసుల సంఖ్య!

  • కొత్తగా 8,702 కేసుల నమోదు
  • 24 గంటల్లో 72 మంది మృతి
  • 6,01,462కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
Corona cases in AP crosse 6 lakhs

ఏపీలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈరోజుతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 8,702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1,383, పశ్చిమగోదావరి జిల్లాలో 1,064 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 5,177కి చేరుకున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 6,01,462కి చేరుకున్నాయి. 5,08,088 మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం 88,197 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

More Telugu News