Union Minister: కరోనా బారినపడ్డ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్!

Union minister Prahlad Singh tests with Corona positive
  • తనతో మెలిగిన వారు జాగ్రత్తగా ఉండాలని ప్రహ్లాద్ హెచ్చరిక
  • ఇప్పటికే 25 మందికి పైగా ఎంపీలకు కరోనా
  • 50 మంది పార్లమెంటు సిబ్బందికి సోకిన మహమ్మారి
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో మంత్రులకు, ఎంపీలకు, సిబ్బందికి కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురికి కరోనా సోకినట్టు రిపోర్టులు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడ్డారు.

తాజాగా మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, రెండు రోజులుగా తనతో మెలిగిన వారు జాగ్రత్తగా ఉండాలని, టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఇప్పటికే 25 మందికి పైగా ఎంపీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. 50 మంది పార్లమెంటు సిబ్బంది కూడా ఈ మహమ్మారి బారిన పడినట్టు సమాచారం.
Union Minister
Prahlad Singh
Corona Virus

More Telugu News