శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితుడైన సినీ నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్
- నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ2గా అశోక్ రెడ్డి
- పరారీలో ఉన్న ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు
- వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలింపు
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఆశ చూపి, శ్రావణితో అశోక్ రెడ్డి సంబంధం ఏర్పరచుకున్నాడని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. అయితే, దేవరాజ్ కు శ్రావణి దగ్గర కావడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి వారిద్దరూ విడిపోయేందుకు యత్నించాడు. ఈ నెల 7న అమీర్ పేట హోటల్ వద్ద శ్రావణి, దేవరాజ్ గొడవపడ్డారు. ఆ తర్వాత సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అశోక్ రెడ్డి అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఆమెను హింసించారు. అనంతరం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.