Corona Virus: దేశంలో అరకోటి దాటిన కరోనా కేసులు

  • గత 24 గంటల్లో దేశంలో 90,123 మందికి నిర్ధారణ
  • మొత్తం కేసుల సంఖ్య 50,20,360
  • మృతుల సంఖ్య మొత్తం 82,066
  • 9,95,933 మందికి ప్రస్తుతం చికిత్స  
India COVID19 case tally crosses 50 lakh mark

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 90,123 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50,20,360 కు చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,290 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 82,066కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 39,42,361 మంది కోలుకున్నారు. 9,95,933 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
                          
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 5,94,29,115 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,16,842 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News