china jeeyar: త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి త‌ల్లి క‌న్నుమూత‌

  • కొంత కాలంగా అనారోగ్యం
  • గ‌త రాత్రి తుది శ్వాస విడిచిన అలివేలు
  • కాసేప‌ట్లో ఆమె అంత్య‌క్రియ‌లు  
chinajeeyar mother passes away

త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి త‌ల్లి అలివేలు మంగ(85) క‌న్నుమూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె గ‌త‌ రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో మృతి చెందారు. దీంతో చిన‌జీయ‌ర్ స్వామి త‌న కార్య‌క్ర‌మాల‌న్నింటినీ వాయిదా వేసుకున్నారు.  ఈ రోజు మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ శివారులోని శంషాబాద్ ముచ్చింత‌ల్‌లోని చిన‌జీయ‌ర్ ఆశ్ర‌మం స‌మీపంలో ఆమె అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయని ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు.  


More Telugu News