ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది: ఏపీ మంత్రి వెల్లంపల్లి

There is a conspiracy behind govt says Vellampally
షార్ట్స్‌లో చూడండి
ఏపీలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేతం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద చోటు చేసుకున్న అగ్నిప్రమాదం సంచలనం రేపుతోంది. ఈ అగ్నిప్రమాదంలో స్వామివారి రథం దగ్ధం కావడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు, విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని... ఆ కుట్రను ఛేదిస్తామని చెప్పారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని... అలసత్వం వహించిన అధికారులపై ఇప్పటికే బదిలీ వేటు వేశామని, పలువురిని సస్పెండ్ చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను కాపాడుకుంటామని అన్నారు.
Go Back to Shorts
Vellampalli Srinivasa Rao
Andhra Pradesh
Antarvedi
YSRCP

More Telugu News