kangana ranut: భారీగా పడిపోతోన్న కంగనా రనౌత్‌ ఫాలోవర్ల సంఖ్య.. రాకెట్ చాలా బ‌లంగా ఉందన్న హీరోయిన్

  • వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోన్న కంగనా
  • ట్విట్టర్‌లో ప్రతిరోజు 50 వేల మంది అన్‌ఫాలో
  • తాను గ‌మ‌నించానని చెప్పిన హీరోయిన్
  • ఎందుకు అన్‌ఫాలో అవుతున్నారో తెలియట్లేదని వ్యాఖ్య
kangana on her twitter follwers mentality

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ మృతి నేపథ్యంలో బాలీవుడ్‌లో నెపోటిజంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న హీరోయిన్ కంగనా రనౌత్‌పై పలువురు సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులూ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. పబ్లిసిటీ కోసమే ఆమె పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటుందని ఆమెపై విమర్శలు వస్తున్నాయి.

ఓ వైపు బంధుప్రీతి వల్ల సినీరంగంలోకి ప్రవేశించిన ప్రముఖుల సామాజిక మాధ్యమాలను ప్రేక్షకులు అన్‌ఫాలో అవుతుంటే, మరోవైపు నెపోటిజంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తోన్న కంగనాకు అన్‌ఫాలో చేస్తూ ఆమెకు నెటిజన్లు షాక్ ఇచ్చారు.

కంగనా ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకీ పడిపోతోంది. దీంతో ఓ నెటిజన్ ఆమెకు ట్వీట్ చేశాడు. ప్ర‌తి రోజు  దాదాపు 50 వేల మంది ఫాలోవర్లను కోల్పోతున్నారని ఆమెకు గుర్తు చేశాడు. దీనిపై కంగనా రనౌత్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని తాను గ‌మ‌నించానని చెప్పింది. ట్విట్టర్ తనకు కొత్త‌ అని, నెటిజన్లు ఎందుకు అన్‌ఫాలో అవుతున్నారో తెలియట్లేదని తెలిపింది.

తనలాంటి జాతీయవాదులు ప్రతి చోట కష్టపడాల్సి వస్తుందని, రాకెట్ చాలా బ‌లంగా ఉందని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. తనను అన్‌ఫాలో చేసిన వారికి హృద‌య‌పూర్వ‌క క్ష‌మాప‌ణలు చెబుతున్నానంటూ పేర్కొంది. కాగా, ఆమె ఇటీవలే బాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్ నడుస్తోందంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

More Telugu News