NGT: రాయలసీమ ఎత్తిపోతల పథకం కేసు రీ-ఓపెన్ కు ఎన్జీటీ అంగీకారం

  • రాయలసీమ ఎత్తిపోతల కేసు రీ ఓపెన్ కు తెలంగాణ దరఖాస్తు
  • తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్జీటీ సమ్మతి
  • ఈ నెల 28న తదుపరి విచారణ
NGT accepted to re open Rayalaseema Lift Irrigation case

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం కేసు రీ ఓపెన్ కు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) సమ్మతి తెలిపింది. ఈ కేసులో తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్జీటీ అంగీకరించింది. ఈ అంశంలో కేసు రీ ఓపెన్ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఆ దరఖాస్తును పరిశీలించిన ఎన్జీటీ... ఇప్పటికే సిద్ధం చేసిన తీర్పును వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

More Telugu News