West Godavari District: కరోనాతో మృతి చెందిన ఇంటి యజమాని.. అర్ధరాత్రి గోదావరిలో దూకి కుటుంబం ఆత్మహత్య

  • విషయం తెలిసినా పరామర్శకు రాని బంధువులు, స్నేహితులు
  • మనస్తాపంతో బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకిన కుటుంబం
  • వరద ఉద్ధృతి కారణంగా సహాయక చర్యలకు అంతరాయం
Family suicide after family head died with corona virus

కరోనా బారినపడి కుటుంబ పెద్ద మృతి చెందడంతో మనస్తాపం చెందిన కుటుంబం అర్ధరాత్రి వేళ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని పసివేదలలో జరిగింది. గ్రామానికి చెందిన నరసయ్య ఈ నెల 16న కరోనాతో మృతి చెందాడు.

విషయం తెలిసినప్పటికీ బంధువులు కానీ, స్నేహితులు కానీ పలకరించేందుకు రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరసయ్య భార్య సునీత (50), కుమారుడు ఫణికుమార్ (25), కుమార్తె అపర్ణ (23) గత అర్ధరాత్రి రైల్వే బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గోదావరి నది ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News