Corona Virus: దేశంలో 27 లక్షలు దాటిన కరోనా కేసులు

  Over 55000 cases in India in 24 hours
  • 55,079 మందికి కొత్తగా కరోనా 
  • మృతుల సంఖ్య మొత్తం 51,797
  • 6,73,166  మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న వారు 19,77,780  మంది
దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో 24 గంటల్లో 55,079 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 876 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 27,02,743కు  చేరగా, మృతుల సంఖ్య మొత్తం 51,797  కి పెరిగింది. ఇక 6,73,166   మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 19,77,780  మంది కోలుకున్నారు.
                                                                                 
కాగా, నిన్నటి వరకు మొత్తం 3,09,41,264  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,99,864 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
Corona Virus
COVID-19
India

More Telugu News