New Zealand: న్యూజిలాండ్ లో మళ్లీ కరోనా కేసులు.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని జసిండా

  • 102 రోజుల తర్వాత మళ్లీ నమోదవుతున్న కరోనా కేసులు
  • సాధారణ ఎన్నికలను వాయిదా వేసిన ప్రధాని
  • దేశంలో ప్రస్తుతం 78 యాక్టివ్ కేసులు
New Zealand announces postponement of elections

కరోనాను నియంత్రించిన దేశంగా న్యూజిలాండ్ నిలబడ్డ సంగతి తెలిసిందే. అయితే, దాదాపు 102 రోజుల తర్వాత ఆ దేశంలో మళ్లీ కరోనా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల జరగాల్సిన సాధారణ ఎన్నికలను నాలుగు వారాల పాటు వాయిదా వేశారు.

వాస్తవానికి సెప్టెంబర్ 19న ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆ ఎన్నికలను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాతే  ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కరోనా వల్ల ఆక్లాండ్ లో లాక్ డౌన్ విధిస్తున్నామని చెప్పారు.

మూడు నెలల క్రితం న్యూజిలాండ్ ను కరోనా రహిత దేశంగా జసిండా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆ దేశంలో 1600 వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 78 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News